క్రీడ‌ల‌తో మంచి వ్య‌క్తిత్వం అల‌వ‌డుతుంది : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శిక్షణ క్రికెట్ స్టేడియంను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలకు అలవాటు కావటం వ‌ల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి వ్యక్తిత్వం దిశగా రూపుదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంద‌న్నారు. సురభి కాలనీ యూత్ కోరిక మేరకు క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించామ‌ని, ఇక్కడే ఓపెన్ జిమ్‌ ఏర్పాటు అయ్యేలా చూస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ చిరంజీవి, స్పోర్ట్ సెక్రటరీ సీవీ రవి, ఎస్ఏ రఘునాథ్, మాజీ అద్యక్షుడు ఆర్‌. నరేందర్, సంక్షేమ అధ్యక్షుడు వి.శ్రీనివాస్ రావు, గోపాల్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, ఆర్‌. సతీష్, ఎస్ఏ చంద్రశేఖర్, వి. జితేందర్, ఆర్. శరత్, ఆర్.పూజిత్, సీవీ భాను, సాయి, రమేష్ పాల్గొన్నారు.

సురభి కాలనీలో శిక్షణ క్రికెట్ స్టేడియంను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here