బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ త‌న‌పై ఉన్న నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను నిర్వహించి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, త‌న‌కు ఈ అవకాశాన్ని కల్పించిన బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డిల‌కు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకుంటున్న గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here