సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సైబరాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో పలు అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. చట్టాలపై అవగాహన, షీ టీమ్స్, గృహ హింస, యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, కమ్యూనిటీ సీసీటీవీల ఏర్పాటు, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావాలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్, బాల్య వివాహాలు, మొబైల్ ఫోన్ల వాడకం, రోడ్డు ప్రమాదాలు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్లను ధరించడం, మానవ అక్రమ రవాణా.. తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.