నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన చిన్ననాటి మిత్రులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. శేరిలింగంపల్లి జడ్పీహెచ్ఎస్ 1991- 92 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి మిత్రులు గోపన్ పల్లి లోని ఓ ప్రైవేట్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. చిన్ననాటి తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.