శేరిలింగంపల్లి డివిజన్ లో కాంగ్రెస్ నాయకుల ఆజాదీ కి గౌరవ్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆజాదీ కి గౌరవ్ పాదయాత్ర నిర్వహించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ రోడ్ నం1 నుంచి నెహ్రూ నగర్, గోపీ నగర్, బాపు నగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ మీదుగా దూబే కాలనీ వరకు కొనసాగింది. జాతీయ జెండాలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోటింరెడ్డి వినయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్, కో ఆర్డినేటర్ ఎం. రఘునందన్ రెడ్డి, నాయకులు ఎన్‌వివిఎస్ చౌదరి, భరత్ కుమార్ గౌడ్, శామ్యూల్ కార్తీక్, అయాజ్ అహ్మద్ ఖాన్, హబీబ్ జానీ, ఖాజా అజీముద్దీన్, మహమ్మద్ జహంగీర్, ఖాజపాషా, మోసిన్, మహమ్మద్ మునావర్, హరి కిషన్, అల్లావుద్దీన్ పటేల్, మహమ్మద్ జావిద్ హుస్సేన్, మహమ్మద్ ముకరం ఉస్మాన్, కంది రాజు, రాజేష్, ఖమర్ పాషా, వహీదా తదితరులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఆజాదీ కీ గౌరవ్ పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here