మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక పూజలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి సందర్భంగా చందానగర్ డివిజన్‌లోని రాజీవ్ నగర్‌లో భక్తి శ్రద్ధల న‌డుమ గణపతి పూజల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల‌ను కాంగ్రెస్ నాయకుడు, మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం దంపతుల ఆధ్వర్యంలో నిర్వ‌హించారు. ఉత్సవాల్లో స్థానిక కాలనీవాసులు, శ్రీ గంగమ్మ తల్లి యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాలతో గణపతిని ఆరాధించారు. భక్తులంతా వినాయకుడి ఆశీర్వాదం కోసం ప్రార్థనలు చేసి పూజ అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ గణపతి ఉత్సవాలు సమాజంలో ఐక్యత, సత్సంగం, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి విగ్రహాలను వినియోగించడం అత్యంత ముఖ్యమని, ఇది నీటి కాలుష్యాన్ని తగ్గించగలదని సమగ్రంగా వివరించారు.

యువతలో పర్యావరణ అవగాహన పెంపొందించటం ద్వారా భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన వాతావరణాన్ని అందించవచ్చని సూచించారు. పూజ‌ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మిరియాల ప్రీతం దంపతుల సేవా భావాన్ని అభినందిస్తూ, ఇలాంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు సమాజంలో సమగ్ర అభివృద్ధికి సహకరిస్తాయని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here