స్వాతి హైస్కూల్‌లో ఘ‌నంగా గాంధీ జ‌యంతి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ లోని స్వాతి హైస్కూల్ ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన నాయకులలో జాతిపిత మహాత్మాగాంధీ అగ్రగణ్యుడు అని అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య దాస్య శృంఖలాల నుండి సత్యము, అహింసలను సిద్ధాంతాలుగా చేసుకొని సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాడి మనకు స్వాతంత్య్రం సంపాదించార‌న్నారు. ప్రతి ఒక్కరూ మన మతాన్ని మనం ప్రేమించుకుంటూ ఎదుటి మతాన్ని గౌరవిస్తూ గాంధీ సిద్ధాంతాలను చిత్తశుద్ధితో పాటిస్తూ అభివృద్ధికి బాటలు వేద్దాం అని కోరారు. అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన తాడిబోయిన రామస్వామి యాదవ్

ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. ణికుమార్ GHMC పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస పరిషత్ ఆర్యభట్ట శాఖ సభ్యుడు బాల్ద అశోక్, సురేందర్ రెడ్డి, యోగానంద్‌, శ్రీనివాస్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వర రావు, వాణి సాంబశివరావు, అమ్మయ్య చౌదరి, నండూరి వేంకటేశ్వర రాజు, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికుల‌కు వ‌స్త్రాల‌ను అంద‌జేసిన దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here