విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో శ్రీ శ్రీ ఈదమ్మ పోచమ్మ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి మండపం వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు .

గణపతికి పూజలు చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు నవరాత్రులకు మట్టి గణపతి విగ్రహాల తోనే పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని అన్నారు .విఘ్నేశ్వరునికి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని విఘ్నేశ్వరునికి వారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శేఖర్, ప్రభాకర్, వెంకట్ స్వామి, దేవేందర్, రాజు, గోపాల్, కిషన్ నాయక్, ప్రసాద్, శ్రీకాంత్, నరేందర్, గణేష్ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు, భక్తులు, బస్తి వాసులు , కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

వినాయకుడికి హారతి పడుతున్న కార్పొరేటర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here