నమస్తే శేరిలింగంపల్లి: ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా.. నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కాలనీ కి చెందిన శ్రీనివాసరావుకు రూ. 1 లక్ష, కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీ కి చెందిన శివకు లక్ష మంజూరు కాగా దానికి సంభందించిన ఎల్వోసి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా ఉంటున్న దని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పాల్గొన్నారు.
