అజ్ఞాన పాలన అంతానికి ప్రజలు చైతన్యవంతులు కావాలి – వినాయకుడి చెంత బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్, భారతి నగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, హైదర్ నగర్, అల్విన్ కాలనీ మొదలగు డివిజన్ల కాలనీ, అపార్ట్ మెంట్, బస్తి యూత్ అసోసియేషన్ల వాసుల ఆహ్వానం మేరకు సుమారు 88 వివిధ రూపాలలోని గణపతి ప్రతిమలను దర్షించుకుని పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. దశాబ్దాల కాలం నుండి తమ ఆచారాలతో గణపతులను పూజించి చెరువులలో నిమజ్జనం చేసే సంప్రదాయం ప్రజలు కొనసాగిస్తున్నారు. అలాంటి సంప్రదాయాలను కొనసాగకుండా సుమారు 3-4 సంవత్సరాలుగా చెరువులలో నీళ్లు లేకుండా చేసి చెరువులను చెరపట్టిన వారి అక్రమ, అవినీతి, అరాచక, అజ్ఞాన పాలన అంతం కావటానికి , ప్రజలు చైతన్యవంతులు కావాలని, గణనాధుడిని వేడుకున్నట్లు మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.

పీ ఏ నగర్ బస్తీలో బస్తివాసులతో కలిసి వినాయక పూజలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here