గుల్‌మొహ‌ర్ పార్క్‌లో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి… ద‌శ‌ల వారిగా అభివృద్ధి ప‌నులు చేప‌డుతాం: కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్ లోని గుల్మొహర్ పార్క్ కాలనీలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి అదేవిధంగా ప్రజా సమస్యలపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శుక్ర‌వారం బస్తీబాట చేపట్టారు. కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి చేస్తామన్నారు. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, వెంకట్ రెడ్డి, దూబె, వెంకట సుబ్బయ్య, శంకర్ యాదవ్ , కిషన్ సింగ్, రమేష్, నర్సింగ్ రావు ,బాలరాజు, , అఖిల్ సాగర్, గుల్మొహర్ పార్క్ కాలనీ ప్రెసిడెంట్ ఖాసిం, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు, టీ వీ రావు, ఆఫీస్ బీరెర్స్ శేకర్ రావు , ఆనంద్ కుమార్, విల్సన్ కుమార్ , శేష సాయి , దుర్గ ప్రసాద్ , నబీ రసూల్ , చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ అధికారులు, శానిటేషన్ సూపర్ వైజర్ భరత్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ‌కార్పొరేటర్‌ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here