చందాన‌గ‌ర్‌లో 9వ రోజు ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి… నాలుగు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ మంజులర‌ఘునాథ్ రెడ్డి

నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 9వ రోజు చందానగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ కాలనీ , ఇక్రిసాట్ కాలనీ , కెఎస్ఆర్ ఎన్ క్లేవ్ , దీప్తిశ్రీ నగర్ కాలనీలలో పలు శాఖల అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలలో చేపట్టే పలు అభివృద్ధి పనులను కాలనీ వాసులకు వివరించారు. కాలనీలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది సహాయంతో తోలగించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, ఈఈ శ్రీకాంతి, డీఈ రుపాదేవి వాటర్ వర్క్స్‌ ఏరియా మేనేజర్ సునిత, ఎస్ ఆర్ పీ బాలాజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పట్టణ ప్రగతి లో పాల్గొన్న ‌ఎమ్మెల్యే‌ గాంధీ, కార్పొరేటర్ మంజుల
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here