శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): కాళేశ్వరం కమిషన్ ముందు తన అభిప్రాయం వివరించడానికి వచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కి సంఘీభావంగా కమిషన్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ శ్రేణులతో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాయిబాబా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్కు వచ్చిన పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి నిరూపించాలని డిమాండ్ చేశారు.