శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి హోసింగ్ బోర్డ్ కాలనీ మెట్రో స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ షాప్ కెఫే ను శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గౌతమ్, ఫణి, భవాని ప్రసాద్ రెడ్డి, నాయకులు భాస్కర్, రమేష్ గౌడ్, మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు.






