శేరిలింగంపల్లి, నవంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఎస్.ఆర్ నగర్ కాలనీ లో జరిగిన ఎస్.ఆర్ నగర్ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్మ సంఘం కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్లు సరళ, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసం సందర్బంగా ఎస్.ఆర్ నగర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమంను నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇది ఒక శుభపరిణామం అని, కమ్మ సంఘం సభ్యులు ఐక్యత గా ఉండాలని అన్నారు. కమ్మ సంఘం సభ్యులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని అన్నారు.






