శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యాధికారమే లక్ష్యంగా బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీలంతా హాజరుకావాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగుల బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాల గొంతుకను వినిపించడానికి బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఈ సమావేశంలో బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బీసీలు రాజ్యాధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలో చర్చించుకుని బీసీల సమేతంగా పోరాటం చేయాలని అన్నారు. బీసీల ఐకమత్యమే బీసీల రాజ్యాధికారం అన్నారు. బీసీలందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు. కూకటపల్లిలోని కేపీహెచ్బీ కాలనీ కళామందిర్ రోడ్డులో ఉన్న హోటల్ వైష్ణవి గ్రాండ్లో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.






