పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంది: పిఏసీ చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంద‌ని పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ అన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి, భూ తాపం తగ్గించి, మొక్కలు విరివిగా పెంచాల్సిన నైతిక భాద్యత అందరిపై ఉంద‌ని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోనీ గోల్డెన్ తులిప్ కాలనీలో జీహెచ్ఏంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిఏసీ చైర్మన్, శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, జీహెచ్ఏంసీ డిప్యూటీ కమిషనర్ వి. ప్రశాంతి, అధికారులు, సిబ్బంది, కాలనీవాసులతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాలనీ పరిసరాలలో, కాలనీ పార్కు పరిసరాలలో పలు రకాల మొక్కలు టారు. అనంతరం కాలనీవాసులచే, ప్రజలచే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అంటే ప్రకృతిని, సహజ వనరులను రక్షించడం అని, కాలుష్యాన్ని నివారించడం, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడటమని అన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని సజీవంగా ఉంచటం చాలా అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ విధిగా తెలుసుకోవాలన్నారు. పర్యావరణం లేకుండా, జీవరాశుల మనుగడ సాధ్యం కాదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఏంహెచ్వో శ్రీకాంత్ రెడ్డి, స్వచ్ భారత్ మిషన్ డైరెక్టర్ యశస్వి, శానిటేషన్ సూపెర్వైజర్స్ కిరణ్ కుమార్ రెడ్డి, కిష్టయ్య, కృష్ణ, యస్ఎఫ్ఏ అచ్యుత్, వేణు, గోల్డెన్ తులిప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, సెక్రటరీ ఎస్వియన్ రాజు, లక్ష్మణ్, కచ్చావా దీపక్, రమణ, శ్రీకాంత్, విజయ్ శర్మ, అరవింద్, షాబుద్దీన్, సంజీవ కుమార్, అశోక్ కుమార్, పద్మనాభం, విరంచి వర్మ, హేమంత్ శర్మ, దయానిధి, కృపాకర్, మహేష్ కుమార్, సత్యనారాయణ, వెంకట్రావు, తిలక్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here