శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని మాధవ బృందావన్ అపార్ట్మెంట్స్ కాలనీలో మహిళలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మలను ఒక్క చోట చేర్చి ఆట పాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.






