గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

హైద‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కల్లుగీత వృత్తి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన‌ని ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ నాయకులు ఆదివారం మంత్రిని ఆయ‌న నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని క‌మిటీకి మంత్రి హామీ ఇచ్చారు. గీతవృత్తిలో ప్రమాదంలో అంగవైకల్యానికి గురైన ప‌క్షంలో అందుకు అనుగుణంగా మెడికల్ బోర్డు నిబంధనల‌ను తక్షణమే సవరించాలని క‌మిటీ కోరిన వెంటనే మంత్రి స్పందించారు. ఎక్సైజ్ అధికారులకు ఆ మేర‌కు ఆదేశాలు జారీచేశారు. ఇందుకు మంత్రికి నాయ‌కులు కృతజ్ఞతలు తెలిపారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ భువనగిరి వద్ద నందన వనంలో త్వరలో నీరా ఉత్పత్తులను ప్రారంభిస్తామ‌ని, హైదరాబాద్ లో 5 ఎకరాల గౌడ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, కల్లు గీత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్బంగా నాయ‌కులు మంత్రికి నూతన సంవత్సర శుభాకంక్షాలు తెలియజేశారు. మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను క‌లిసిన వారిలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ ఉన్నారు.

మంత్రి వి.శ్రీ‌నివాస్ గౌడ్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతున్న గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here