టిఎన్ నగర్ కాలనీ వాసుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, మే 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని టిఎన్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కాలనీలో తలెత్తిన సమస్యలను స్వయంగా వెళ్లి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో టిఎన్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను విడతల వారిగా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీ, మంజీర మంచినీటి వసతులను మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ నగర్ కాలనీ వాసులు చంద్రకళ, నర్సింహులు, రాములు, వెంకటేష్, బాలమణిని, రూప, పాండు, వంశి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here