శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మాధవ హిల్స్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులతో కలిసి కాలనీ లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాధవ హిల్స్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో నిత్యం డ్రైనేజి పొంగి పొర్లుతుంది అని , ఔట్ లెట్ సరిగ్గా లేక రోడ్ల పై ప్రవహిస్తుంది అని , డ్రైనేజి సమస్య తీవ్రమైందని, ఔట్ లెట్ సమస్య ను పరిష్కరించి, డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరించాలని, సీసీ రోడ్లు వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మాధవ హిల్స్ కాలనీలో నెలకొన్న డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, డ్రైనేజి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామని, మ్యాన్ హోల్ నుండి మ్యాన్ హోల్ వరకు పూడిక తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. ఔట్ లెట్ సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అవసరమున్న చోట మ్యాన్ హోల్స్ పునరుద్ధరించాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన, డ్రైనేజి, రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవ హిల్స్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






