హఫీజ్పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో నెలకొన్న మౌలిక వసతులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ వి.పూజిత గౌడ్ తెలిపారు. గురువారం డివిజన్ పరిధిలోని శాంతినగర్ బస్తీలో కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్లు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం యూజీడీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు సుధాకర్, తిమ్మయ్య, హనీఫ్, మౌలానా, కృష్ణ, నర్సింగ, శ్రీకాంత్ పాల్గొన్నారు.

