కమల ప్రసన్న నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూన్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కమల ప్రసన్న నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని త‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కమల ప్రసన్న నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన 2 సీసీ రోడ్లను వేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర‌చాలని, వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీలో పర్యటిస్తానని, కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు క‌ల్పించామ‌ని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, UGD పనులు అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు సంజీవ రెడ్డి, కమల ప్రసన్న నగర్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జాయింట్ సెక్రెటరీ బండప్ప, రాఘవులు, ఆర్గనైజర్ వెంకటేష్, సుబ్బారావు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here