ప్రతి బస్తీ, కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి: కార్పొరేటర్ శ్రీ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, మే 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ‌లొ రూ 68.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యత‌ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు వారు సూచించారు.

గచ్చిబౌలి డివిజన్ లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌనిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. గచ్చిబౌలి డివిజన్‌ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని కాలనీ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రషీద్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు కైలాష్ సింగ్, సుమన్, శ్రీకాంత్ రెడ్డి, బాబ్లీ సింగ్, గోపాల్ , గణేష్ సింగ్, రంజిత్ సింగ్, విశాల్, విక్కీ, శంకేష్, శ్రీను, కిషోర్ సింగ్, బీరేందర్ సింగ్, నిరంజన్ గౌడ్, ప్రవీణ్, సతీష్, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, నానక్ రామ్ గూడ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here