శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ భాగ్యనగర్ కాలనీ అభివృద్ధికి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో చాపరల శ్రీనివాస్ దాసు, భాగ్యనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్లు చంద్రమౌళి, అంజనా, శ్రీనివాస గౌడ్, సత్యనారాయణ , జనరల్ సెక్రెటరీ రామలింగేశ్వర రావు, జాయింట్ సెక్రటరీలు అనిల్ కుమార్, ఈశ్వర్ నిఖిల్, వెంకారెడ్డి, వినయ్ రాజా, ట్రెజరర్ రాజేంద్రప్రసాద్ ,అసిస్టెంట్ B. V రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బ్రహ్మానంద రెడ్డి, స్పోర్ట్స్ సెక్రెటరీ జనార్దన్, కల్చరల్ సెక్రెటరీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.