శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధానా కార్యదర్శిగా ఎన్నికైన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని ఆయన నివాసంలో నియోజకవర్గం నాయకుడు ఏకాంత్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భానుయాదవ్, గణేష్ గౌడ్, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అశోక్, ప్రధానకార్యదర్శి జితేందర్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు నాగమణి, భూషణం, సంపంగి యాదగిరి, బొట్టు శ్రీను, దయాకర్ రెడ్డి, అంబికా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.