వరద బాధితులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆర్ధిక సహాయం

శేరిలింగంపల్లి, జూన్ 12 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి విలేజ్, రామయ్య నగర్ తదితర బస్తిల్లో 15 సెంటీమీటర్ల రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హుటాహుటిన వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలకు బియ్యం, సరుకులు, ఇంటి సామాగ్రి కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని, అందుకు శాయ‌శక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రాకేష్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here