శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ మధురానగర్ లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నూతనంగా ఏర్పాటు చేస్తున్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి రూ.1 లక్ష విరాళాన్ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు,గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు కృష్ణ మూర్తి, కిషోర్, అవినాష్, వినయ్, సంగమేష్, సంతోష్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.