శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ రావు నగర్ కాలనీలో ఓ బాలిక అదృశ్యమై పోలీసుల సంరక్షణలో చేరింది. బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను తమ సంరక్షణలో ఉంచారు. తన పేరు జ్యోతిక అని, తల్లిదండ్రుల పేర్లు అఖిల, నవీన్ అని చెబుతుందని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఈ పాపను గుర్తిస్తే తన ఫోన్ నెంబర్ 87125 68116 కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.