మంత్రి కేటీఆర్ స‌హ‌కారంతో డివిజ‌న్ అభివృద్ధి: కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

మాదాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ ప్రజలకు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామ‌ని కార్పొరేట‌ర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బుధ‌వారం డివిజన్ పరిధిలోని ఖానామెట్ ముస్లిం బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ గ్రేట‌ర్ ప‌రిధిలో ప్ర‌తి డివిజ‌న్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఆయ‌న స‌హ‌కారంతో మాదాపూర్ డివిజ‌న్‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఈ కార్యక్ర‌మంలో ఏఈ ప్రశాంత్, నాయకులు గౌస్, గణేష్ యాదవ్, సార్వార్, సతీష్ యాదవ్, శ్యామ్, వంశీ యాదవ్, అరుణ్ యాదవ్, సయ్యద్ షైబజ్, షాయల్, అప్జల్, సయ్యద్ అలీ, అచ్యుత్ పాల్గొన్నారు.

సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
స్థానికుల‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here