మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని ఖానామెట్ ముస్లిం బస్తీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలో ప్రతి డివిజన్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన సహకారంతో మాదాపూర్ డివిజన్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంత్, నాయకులు గౌస్, గణేష్ యాదవ్, సార్వార్, సతీష్ యాదవ్, శ్యామ్, వంశీ యాదవ్, అరుణ్ యాదవ్, సయ్యద్ షైబజ్, షాయల్, అప్జల్, సయ్యద్ అలీ, అచ్యుత్ పాల్గొన్నారు.

