కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

కూక‌ట్‌ప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌ప‌ల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్‌ప‌ల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.56,06,496 ఆర్థిక స‌హాయాన్ని 56 మంది లబ్ధిదారులకు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెక్కుల రూపేణా అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 56 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంద‌ని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, ప్రసాద్, లక్ష్మీనారాయణ, జిల్లా గణేష్, అనిల్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, ఎల్లం నాయుడు, అష్రాఫ్, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు.

ల‌బ్ధిదారుల‌కు చెక్కుల‌ను అందజేసిన ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here