శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 11,01,276 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా లబ్ధిదారులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,ప్రసాద్, నరేష్ నాయక్, సంతోష్ ముదిరాజ్ ,శివ ముదిరాజ్, వెంకటేష్, భీమ్ రాజ్ , అవినాష్, చందు, తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.