శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్ , భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.20,02,320 ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చెక్కుల రూపేణా అందచేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ 20 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్ , అక్బర్ ఖాన్, MD ఇబ్రహిం, మల్లేష్ గుప్తా, రాజు నాయక్, నరేందర్ బల్లా, యూసఫ్, కాజా, సందీప్ రెడ్డి, మల్లేష్, గోపాల్ రావు, శివ, నరేష్, కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు.