శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 26 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.10,64,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, కోనేరు ప్రసాద్, శివరాజు గౌడ్, పోశెట్టి గౌడ్, గోపాల్, లింగం, సత్యనారాయణ, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.