యూనిఫార్మ్స్ ను పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 12 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై నిబద్ధతతో పని చేస్తుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన సురభి కాలనీలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫామ్ లను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని అన్నారు. విద్యార్థులకు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ZPHS హెచ్ఎం రత్న కుమారి, ఇంచార్జి హెచ్ఎం బల్వంత్ రెడ్డి, సురభి కాలనీ ఎంపీపీఎస్ హెచ్ఎం పాండురంగా రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సెంట్రల్ పార్క్ ఫేస్-2 ప్రెసిడెంట్ అరుణ, జనరల్ సెక్రటరీ వేణు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లక్ష్మి, ఉదయకుమారి, దుర్గా భవాని, సూర్యప్రభ, వీరేశం, కేశవ రెడ్డి, ఆశ్రఫ్, మౌనిక, వనిత, విజయ, మాధవి, పూజిత, మహేశ్వరి, మల్లికాంబ, ధనలక్ష్మి, పద్మావతి, కరుణ, పద్మజ, పద్మకుమార్, విజయ, సిద్ధిరమేశ్వర్, నర్సింలు, స్థానిక మహిళలు లక్ష్మి, జయమ్మ, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here