గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగుడా వడ్డెర బస్తీలో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గిరి, వీఆర్వో శ్రీనివాస్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.







