ప్రభుత్వ పాఠశాల‌ విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న లక్ష మంది విద్యార్థులకు నిఘంటువుల (డిక్షనరీ)ను పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. అందులో భాగంగా శనివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ శ్రీకాంత్ తో కలిసి విద్యార్థులకు నిఘంటువుల (డిక్షనరి) లను ఎమ్మల్యే గాంధీ అందజేశారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే ఈ‌ డిక్షనరీలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసుంధర, సీనియర్ ఉపాధ్యాయురాలు అరుణ శ్రీ,మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,టీఆర్ఎస్ నాయకులు మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్,గోపరాజు శ్రీనివాస్,మహమ్మద్ కాజా, రాజు,మహిళ నాయకురాలు కలిదిండి రోజా, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు డిక్షనరీలను అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here