అభివృద్ధి ప‌నులు వేగంగా పూర్తి చేయాలి: కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

గ‌చ్చిబౌలి, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్, గౌలిదొడ్డిలో రూ.50 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ల‌కు సూచించారు. డివిజన్ పరిధిలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకుడు భిక్షపతి, శేఖర్, బాలకృష్ణ, హనుమంతు, గణేష్, సుమన్ ప్రసాద్, శ్రీను, రాజు, గోవింద, నగేష్, ఆనంద్, సుధాకర్, బాలయ్య, యాదయ్య, ఎల్లమ్మ, పద్మ, వర్క్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాల‌నీవాసుల‌తో మాట్లాడుతున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here