శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీ, నల్లగండ్ల హుడా కాలనీలలో రూ. 6 కోట్ల 74 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు, తమ కార్పొరేటర్లు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నరేందర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.