శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ల పరిధిలోని మసీదు బండ సుమధుర హారిజన్ , శ్రీ రామ్ నగర్ A బ్లాక్, రాఘవేంద్ర కాలనీలలో రూ. 1.60 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతాలలోప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి గాని , కార్పొరేటర్ దృష్టికి వచ్చినా తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే తన ప్రథమ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారుల మేనేజర్ సందీప్, నాయకులు కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.