తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళ డ్రైవర్ సరిత నాయక్ కి చంద్రిక ప్రసాద్ గౌడ్ శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి, జూన్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా మహిళా డ్రైవర్ రావ‌డం అభినంద‌నీయం అని శేలింగంపల్లి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పి.చంద్రిక ప్రసాద్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత విధుల్లో చేరార‌ని, తొలి రోజు హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు బస్‌ నడపడం విశేషమ‌ని అన్నారు. దాదాపు ఐదేండ్ల పాటు ఆటోను నడిపిన తరువాత హైదరాబాద్ కు కారు డ్రైవింగ్, బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నార‌ని, ఈ క్రమంలోనే హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నారని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఆర్టీసీలో గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహించార‌ని, ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించార‌ని అన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2018లో నాటి రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకున్నార‌ని తెలిపారు.

మహిళా సాధికారత దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాన్నన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SHG గ్రూప్స్ కి బస్సులకు యజమానురాళ్లను చేయడమే కాకుండా ఒక మహిళను మన రాష్ట్రంలో మొదటి ఆర్.టి.సి డ్రైవర్ గా అవకాశం ఇచ్చి మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానమే అని చాటిచెప్పిమ ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here