శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నిర్మల ప్రభాకర్ , డైరెక్టర్ కనక దుర్గ నృత్య విభావరి, పాలక మండలి పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్లోకం, వినాయక స్తోత్రం, లింగాష్టకం, అన్నమాచార్య కీర్తన, అలరులు కురియగా, శబ్దం, ఘంటము పూయరుగా, జతిస్వరం, అయిగిరినందిని అంశాలను సంహిత, సహస్ర, పూర్వి, రితిక, దిత్య, ఆధ్య, కనిష్క, నికిత, నక్షత్ర, ఆరోహి, కృతిక మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. ప్రముఖ నాట్య గురువు ఓలేటి రంగమని, నిర్మల విశ్వేశ్వర రావు, జి వెంకట్ రెడ్డి, జి వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ కుసుమ భోగరాజు , కుసుమ కమలరత్నం మెమోరియల్ ట్రస్ట్ వారు అతిధులుగా విచ్చేసి కళాకారులను అభినందించారు.
