శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని జోనల్ ఆఫీస్లో కమిషనర్ హేమంత్ బోర్ఖడేతో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి.సృజన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జోన్ పరిధిలో కొనసాగుతున్న పారిశుధ్య డ్రైవ్పై పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






