శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీకాకుళం రాజశ్యామల డాన్స్ అకాడమీ నాట్య గురువు లీల కృష్ణా రెడ్డి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో వినాయక కౌతం, శ్రీ విఘ్న రాజాం భజే, దుర్గ తరంగం, అయిగిరినందిని, వందే వసుదేవం, బాలకనకమయ, అన్నమాచార్య కీర్తనలు, శ్రీనివాస కళ్యాణం, ప్రహ్లాద పట్టాభిషేకం అంశాలను హారిక, హర్షిత, జ్యోత్న్స, రితిక, సాహితి, హర్షిత, ముక్త, శరణ్య, చైత్ర సాయి పూజిత, సౌజన్య , ఈక్షిత ప్రదర్శించి మెప్పించారు.






