మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మయూరి డాన్స్ అకాడమీ గురువు వైదేహి సుభాష్ శిష్య బృందంచే “నాట్య స్వర మంజరి” భరతనాట్య ప్రదర్శన, వెంకటరామన్ చే పద్య పఠనంమ్ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/02/cefe0424-1024x685.jpg)
పుష్పాంజలి, తోదయమంగళం నారాయణ వైభవం, మరకతమణిమయ, శివ స్తుతి, మహాదేవ, జావళి, కావడి చిందు అంశాలను వైదేహి, గాయత్రీ, శైలజ, చిన్మయి, శుభశ్రీలు ప్రదర్శించారు.
వెంకటరామన్ భాగవతంలోని గజేంద్ర మోక్షం పద్య పఠనం, శ్రీ భక్త రామదాసు పద్యాలను ఆలపించారు.