శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడలో స్థానిక ప్రజా సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీ వీధుల్లో పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తమ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని కార్పొరేటర్ ని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందిస్తూ జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ అధికారులకు సీసి రోడ్లు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ బస్తీల అభివృద్ధికి ఎల్లవేళలా నిధులు అందుబాటులో ఉంచి సహకరిస్తున్న కార్పొరేటర్ కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రషీద్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, రంజిత్ సింగ్, కైలాష్ సింగ్, అనంత్ రెడ్డి, నరసింహ, శ్రీనివాస్ రెడ్డి కవిత బై, సంతోష్, శేఖర్, సుమన్, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.