మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్లో మంగళవారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. స్థానికంగా వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతో ఆయన స్పందించి వెంటనే జలమండలి అధికారులను సంప్రదించారు. ఈ సందర్భంగా దగ్గరుండి ఆయన సమస్యను పరిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

శ్రీరంగపురంలో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగపురం కాలనీలో కొనసాగుతున్న సీసీ రోడ్ల నిర్మాణం పనులను జిహెచ్ఎంసి డీఈ రూపాదేవి, రమేష్ లతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేసి కాలనీవాసులకు రహదారులను అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ కాంట్రాక్టర్కు సూచించారు.
