శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ రెడ్డిస్ ఎన్క్లేవ్ కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ రెడ్డిస్ ఎన్క్లేవ్ కాలనీ వాసులు తనదృష్టికి తీసుకువచ్చిన సమస్యలను స్వయంగా కాలనీలో పర్యటించి పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలి పోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరి తగతిన పూర్తిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్స్ రెడ్డిస్ ఎన్క్లేవ్ కాలనీ అధ్యక్షుడు గల్లా జ్ఞాన శేఖర్, కార్యవర్గ సభ్యులు తిరుపతి రెడ్డి, నూతలపాటి రమేష్, వెంకటేష్, రాజు, శివయ్య, పూర్ణనందం, వీరభద్ర రావు తదితరులు పాల్గొన్నారు.






