మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో మొక్కల పరిరక్షణకు నూతనంగా నిర్మించనున్న బోరుకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మంగళవారం పూజలు చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, కాలనీ వాసులు తిరుపతి రెడ్డి, భారతి, శివయ్య, రమేష్, మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.






