శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క యాదవ కురుమ గొల్లలకు మంత్రి పదవి దక్కలేదని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములన్న ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 50 శాతం మంత్రి పదవులు ఇవ్వాలని అన్నారు. ఎస్సీలకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని అన్నారు. అలాగే చైర్మన్ పదవుల్లోనూ అవకాశం కల్పించాలన్నారు. బీసీలకు, ముఖ్యంగా యాదవులకు అన్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందన్నారు. ఈ నెల 27వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఐలబోయిన రమేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఐలేష్ యాదవ్, శ్యామ్ యాదవ్, రవీందర్ యాదవ్, కాటం నరసింహ యాదవ్, లొడంగి గోవర్ధన్ యాదవ్, గంగుల మధు యాదవ్, మురళి యాదవ్ పాల్గొన్నారు.